కళ్యాణదుర్గం లోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఎమ్మెల్యే సురేంద్రబాబు తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు శ్రీ పట్టాభి రామస్వామి పై పద్యం పాడారు. ఎమ్మెల్యేతో పాటు ఆలయ అర్చకులు ఎంతో శ్రద్ధగా గరికపాటి ఆలపించిన పద్యాన్ని విన్నారు. సుమారు అరగంట పాటు గరికపాటి రామస్వామి ఆలయంలో గడిపారు.