అనంతపురం నగరంలోని ఉమా నగర్ లో ధనలక్ష్మి అనే వివాహిత తనకు ఉన్న అనారోగ్యానికి వైద్యం చేయించుకునే పరిస్థితి కనిపించడం లేదని మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.