ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి
Ongole Urban, Prakasam | Mar 31, 2026
ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ రాజాబాబు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలను బస్టాండ్ ను పరిశీలించారు. బస్సు సౌకర్యాలు మరియు బస్టాండ్ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్టీసీ డిఎంకు తెలిపారు. అలాగే బస్టాండ్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలా చూస్తామన్నారు. తినుబండారాలు , మొదలగు విక్రయించే దుకాణదారులు అధిక ధరలకు విక్రయించరాదని సూచించారు.