అనంతపురం నగర శివారులోని టీవీ టవర్ కు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.