ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పట్టణ, మున్సిపాలిటీల్లో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుంచి మార్చి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు 35 లక్షల చీరలు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. నవంబర్ 19 నుంచి మొదలై మార్చి 8 వరకు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.