మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 9వ తేదీ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దద్దవాడ, నాగిరెడ్డిపల్లి, అలసందలపల్లి, నారాయణ పల్లి, గుండ్రెడ్డిపల్లి, వెంకటం పల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.