గుమ్మగట్ట మండలం నేత్రపల్లి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా నేత్రపల్లి హైస్కూల్ విద్యార్థినిలతో కలసి గుమ్మగట్ట ఎస్ఐ చిన్నరాయుడు, హైస్కూల్ హెచ్ఎం ఆదిశంకర్ ఉపాధ్యాయులు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో విద్యార్థినీలు ఎదుర్కొనే సమస్యలు వివరించి వాటి పరిష్కార మార్గాలను తెలిపారు. వారి హక్కులు, చట్టాలను గురించి వివరించారు.