కుప్పం: తిరువన్నామలై తరహాలో కంగుందిలో గిరి ప్రదక్షణ : ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
తిరువన్నామలై తరహాలో కుప్పం మండలంలోని కంగుంది దుర్గం చుట్టూ గిరిప్రదక్షణ నిర్వహిస్తామని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన కార్తీక దీపోత్సవం సందర్భంగా ఇవాళ రాత్రి కంగుంది దుర్గం చుట్టూ గిరి ప్రదక్షణ, దీపోత్సవం జరుగుతుందన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.