గుత్తిలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అధికారులు మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం లేకపోవడంతో షెడ్లలలో, ఆరుబయట ఆడాల్సి వస్తున్నదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇండోర్ స్టేడియం నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారం బోర్డ్, టైక్వాండో వంటి క్రీడలను అవుట్డోర్లో ఆడాల్సి వస్తున్నది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.