మార్కులే కొలమానం కాదని పరీక్షలు బాగా రాయలేదని, ఫెయిల్ అవుతాము అనే దిగులుతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని డి.హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం డి.హిరేహాల్ లో ఆయన మాట్లాడుతూ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తల్లిదండ్రులకు మానసిక క్షోభ కలిగించ వద్దని కోరారు. బాగా చదివి పరీక్షలు రాయాలని కోరారు.