గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గుత్తి మండలం నుంచే కాకుండా పెద్దవడుగూరు, పామిడి మండలాల నుంచి భారీ ఎత్తున రైతులు వాహనాల్లో కందులు తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజాము ఐదున్నర గంటలకే పందులు కొనుగోలు కేంద్ర వద్ద కందుల లోడు వాహనాలు బారులు తీరాయి. రైతులు చలికి ఇబ్బందులు పడుతున్నారు.