అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమానికి 140 పిటీషన్లు అందజేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి నేరుగా సమస్యలు విన్నారు. కుటుంబ కలహాలు, రస్తా వివాదాలు, తదితర సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా సమీక్షించి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అనంతపురం అర్బన్ డీఎస్పీశ్రీనివాసరావు, మహిళా డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.