విశ్వనాథ స్వామి ఆలయం వద్ద ప్రత్యక్షమైన నాగేంద్రుడు
Gudur, Tirupati | Nov 16, 2025 మనుబోలులోని విశ్వనాథ స్వామి ఆలయం వద్ద ఆదివారం మరోసారి నాగేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఓం నమశ్శివాయ అంటూ భక్తిపారవశ్యంతో చేతులు జోడించి అలాగే ఉండిపోయారు. గతంలోనూ ఇలాగే నాగుపాములు ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.