కర్నూలు పాత నగరంలో పార్కులు ఉండేది తక్కువ ఉన్న పార్కుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కట్టడాలు నిర్మాణాలు పూర్తికాకముందే కూలిపోతున్నాయి. మరికొన్ని పార్కుల నిర్వహణను గాలికొదిలేసినందున కుక్కలకు పంది కొక్కులకు నిలయంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి,యూనూస్, విమర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానికులతో కలిసి కర్నూలు పెద్ద మార్కెట్ సమీపంలో ఉండే పార్కు దగ్గర నుండి కొండారెడ్డి బురుజు మీదుగా చల్ల కాంపౌండ్ వరకు పార్కులను నీళ్ల ట్యాంకుల ప్రాంతాల్లో పర్యటించారు.