ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో రైతు సత్యనారాయణ రెడ్డి నవంబర్ 26వ తేదీ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు గమనించి ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు సుమారు 20 లక్షలు మేర అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు ఎస్ఐ అంకమ్మరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.