జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచి, కార్మికులపై పనిభారం తగ్గించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. గురువారం రాయదుర్గం మున్సిపల్ కమీషన్ కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కార్మికులు ఈనెల 6,7 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, ఇతర సమస్యలు తీర్చాలని కోరారు. ఈ దీక్షలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.