బనగానపల్లె పట్టణ వైసీపీ కార్యాలయంలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.