కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట లో బుధవారం సీసీ కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గౌతమి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, వార్డు కౌన్సిలర్ అనసూయమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గౌతమి మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు సహకారంతో మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వాములు చేస్తామన్నారు.