అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొని స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో పెన్షన్ వల్ల ఉపయోగం ఉందా, ఒకటవతేదీ పెన్షన్ వస్తోందా, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, తదితర వివరాలను ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.