అనంతపురం నగరంలోని ఐటిఐ వద్ద ప్రకాష్ అనే యువకుడి పై గుర్తుతెలియని యువకులు బ్లేడుతో దాడి చేసి గాయపరిచారు. దీంతో భయాందోళనకు గురైన సదరు యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం నగరంలో కలకలం రేపింది. దీంతో యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.