అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో కావడి శ్రీనివాసులు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.