మార్కాపురం జిల్లా గిద్దలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం నేరాల నియంత్రణపై గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు, కొమరోలు ఎస్ఐ నాగరాజు లకు సీఐ రామకోటయ్య నేరాల నియంత్రణపై పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదలు, దొంగతనాలు అరికట్ట అంశంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సీఐ ఎస్ఐలకు సూచించారు. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడాన్ని నిరోధించడంతోపాటు వాహనాలు ఇచ్చిన యజమానులకు భారీ జరిమాణాలు విధించాలని సూచించారు.