ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే.. గతంలో మాదిరిగా ప్రస్తుతం విద్యా వ్యవస్థ లేదని ఎవరికి వారే వారి ప్రతిభను చాటుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొంది అన్నారు. పోటీ తత్వంతో విద్యార్థుల ప్రతిభ మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దృష్టి సాధించి అభివృద్ధి చేస్తుందన్నారు.