మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని నటరాజ్ సెంటర్లో ఉన్న శ్రీశైలం ముఖ ద్వారానికి రంగులు దిద్ది ముస్తాబు చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ నుండి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దిగువ శ్రీశైలం గా పేరొందిన దోర్నాలలోని ముఖద్వారానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ లైట్లతో అలంకరించారు. భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేశారు.