కలికిరి గ్రామపంచాయతీలో స్వామిత్వ సర్వేను అధికారులు వేగవంతం చేశారు. సోమవారం సాయంత్రం మదనపల్లి డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజు నాలుగు సచివాలయాల సిబ్బందికి సమావేశం నిర్వహించి ప్రస్తుతము ప్రభుత్వం తరఫున జరుగుతున్న సర్వేలు స్వామిత్వ,కౌశలం,సిటిజన్ ఇకెవైసి,పిఎంఎవై ఆవాస్ హౌసింగ్,ఎంబియు మేండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ సర్వేలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మదనపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలికిరి గ్రామ పంచాయతీ ఈఓ అశోక్ ఆధ్వర్యంలో కలికిరి సచివాలయం సిబ్బందితో కలిసి మంగళవారం ఇంటింటికి వెళ్లి సర్వేల కార్యక్రమాలను నిర్వహించారు.