శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆరోగ్యం బాగాలేదని బాబ్జాన్ అనే వ్యక్తి ఇంటిలోనే అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ధర్మవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.