Download Now Banner

This browser does not support the video element.

చెరువులవేనం గ్రామస్థులకు తప్పని రహదారి కష్టాలు..సొంతంగా బండరాళ్లు తొలగించకుంటున్న గ్రామస్తులు

Paderu, Alluri Sitharama Raju | Sep 4, 2025
చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మార్గంలో గుంతలు ఏర్పడి, బండరాళ్లు అడ్డంగా పడ్డాయి. దీంతో సొంతంగా శ్రమదానంతో భారీ బండరాళ్లు తొలగిస్తూ గుంతలు పూడ్చుతున్నట్లు గ్రామస్థులు గురువారం తెలిపారు. ఆ మార్గంలో సుమారు రూ.2.40 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభించలేదన్నారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us