Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: పట్టణంలోని 35వ వార్డు కౌన్సిలర్ షరీఫ్ కన్నుమూత, నివాళులు అర్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్

Guntakal, Anantapur | Aug 21, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు మహమ్మద్ షరీఫ్ మృతి చెందారు. రెండు కిడ్నీలు పాడై గత ఏడాది కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ గురువారం షరీఫ్ స్వగృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. షరీఫ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us