అనకాపల్లి పరిధిలో జాతీయ రహదారిపై అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనకాపల్లి డిఎస్పి శ్రావణి తెలిపారు, జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను ఎన్ హెచ్ ఏ అధికారులతో కలిసి డీఎస్పీ శ్రావణి సోమవారం పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రమాదాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆమె ఆదేశించారు.