గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, అతడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ, బస్సు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.