Download Now Banner

This browser does not support the video element.

ఎండియు వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును అడ్డుకున్న స్థానికులు, 40 బస్తాలు స్వాధీన పరుచుకున్న అధికారులు.

Chirala, Bapatla | Sep 1, 2025
చీరాల వైకుంఠపురంలోని 32 వ నెంబర్ రేషన్ దుకాణం నుండి సోమవారం తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎండియు వాహనంలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ డి.టి గీతా రాణి, ఏఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకొని సదరు వాహనాన్ని తనిఖీ చేయగా 40 బస్తాల రేషన్ బియ్యం దొరికింది.దీంతో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డీలర్ పై సిక్స్ ఏ కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపిస్తామని డి.టి గీతారాణి చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us