యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలోని సుధా నర్సింగ్ హోమ్ లో యాదగిరిగుట్ట మండలం, కమటం గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల ఉదయ్ వైద్యం వికటించి శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. సుధా నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రతాపరెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఉదయ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఆసుపత్రి ముందు మృతదేహాన్ని ఉంచి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఉదయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ, ప్రతాపరెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.