Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని బుజ్జా తండా లో ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించిన ఎంపీడీవో, జిల్లా విద్యాశాఖ అధికారి

Kothagudem, Bhadrari Kothagudem | Aug 22, 2025
పాల్వంచ మండల పరిధిలోని బొజ్జ తండా లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మూర్తి పునః ప్రారంభించారు.. ఈ పాఠశాల గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడింది. మండల విద్యాశాఖ అధికారి బొజ్జ తండా గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ఆ ఆవాసంలో పాఠశాలకు వెళ్లగలిగే విద్యార్థులను గుర్తించడం జరిగింది.. బొజ్జ తండా పాఠశాల పున ప్రారంభించి పదిమంది విద్యార్థులను చేర్పించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మూర్తి తెలిపారు.. పాఠశాల నిర్వహణకు ఒక ఉపాధ్యాయుని కేటాయించడం జరిగిందని తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us