మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో విషాదం అలుముకుంది. ప్రేమ విఫలం కాగా వేనంక వినయ్ బాబు అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి బుచ్చయ్య పల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు.