Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామం వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 7, 2025
రెండు కార్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో చికెన్ షాపు వద్ద ఆగి ఉన్న కారుని మరో కారు వచ్చి ఢీకొంది... ప్రమాదం జరిగిన సమయంలో చికెన్ షాప్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us