నల్గొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ సమీపంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో ఉన్న బండను ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామస్తులు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నిసార్లు బండను తొలగించవద్దని కోరినప్పటికీ కొంతమంది వినలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎల్లమ్మ తల్లి ఆలయ రక్షణకు పోలీసులు సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.