చోడవరం నుండి కొత్తవలస విధులకు ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రభుత్వ ఉద్యోగి గుండె పోటుతో మార్గమధ్యలోనే కూర్చున్న సీటులోనే కుప్పకూలిపోయాడు, ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది, చోడవరం నుండి బయలుదేరిన బస్సులో వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి మార్గమధ్యలో అస్వస్థతకు గురవడంతో డ్రైవర్, కండక్టర్ సపర్యలు చేసినప్పటికీ లాభం లేకపోయింది, కూర్చున్న సీటులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు.