దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:25 నిమిషాలకు జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అర్చకులు ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 3:45 నిమిషాల తర్వాత గ్రహణ మోక్షకాలం) సంప్రోక్షణ జరిపి మంగళ వాయిద్యాలు సుప్రభాత, ప్రాత:కాల పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత నిత్య పూజలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. భక్తుల దర్శన సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంటాయని ఈవో రమాదేవి,అర్చకులు శరత్ కుమార్ తెలిపారు.