బాపట్ల పట్టణంలోని వినాయక పందిళ్లను బుధవారం రాత్రి టౌన్ సిఐ రాంబాబు సందర్శించారు. వాటికి పోలీసు శాఖ అనుమతి ఉన్నది లేనిది ఆరా తీశారు.అలాగే మండపాలలో చేసిన భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహకులతో మాట్లాడుతూ తప్పనిసరిగా మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.డీజేలు పెట్టరాదన్నారు.నిర్వాహకుల్లో కనీసం ఒకరైనా మండపంలో ఉండి తీరాలని సిఐ ఆదేశించారు.