పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 119 ఫిర్యాదులు అందాయి. సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డీఆర్వో కే.పద్మలతతో కలిసి జాయింట్ కలెక్టర్ అభిషేక్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.