Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో అధికారికంగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు,నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఎస్పీ దామోదర్

Ongole Urban, Prakasam | Aug 23, 2025
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శనివారం అధికారికంగా నిర్వహించారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం సాగించిన దేవరంపాడు లోని విజయ స్తూపం వద్ద జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ తో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలను,నీతి నిజాయితీలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జెసి కోరారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us