తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ అవినీతి జరుగుతుందనే ఆరోపణలతో గందరగోళంగా శనివారం మారింది. వార్డుల్లో పనులు సక్రమంగా జరగడం లేదని టీడీపీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు ఓ అధికారిని డీఎంఈకి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. చైర్ పర్సన్ తాడిబోయిన రాధిక కూడా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సహకరించాలని సూచించారు.