పలమనేరు: పట్టణంలో కొంతమంది ఆర్ఎంపి వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ రూముల్లో ఆర్ఎంపి వైద్యుడు దిల్షాద్ ఓ క్లినిక్ నడుపుతూ జిల్లా వైద్యాధికారుల ఆదేశాలను చాలెంజ్ చేస్తున్నాడు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు ప్రథమ చికిత్స చేయాలి తప్ప ఎటువంటి వైద్యం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యదేచ్చగా సూదులు వేయడం సెలైన్లు పెట్టడం చేయడం పరిపాటయింది. ఇక్కడ ఒక విషయం ఆ ఆర్.ఎం.పి వైద్యుడు క్లినిక్ లో లేకపోతే వారి సహాయకులు వచ్చిన రోగులకు ఏది పడితే అది సూదులు ఎక్కించడం సెలైన్లు పెట్టడం విస్మయానికి గురిచేస్తుంది, ఇదేంటని ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు.