ఆలమూరు మండలం చొప్పెల్ల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ తీగల వెంబడి ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు పనులను బుధవారం చేపట్టనున్నట్లు రామచంద్రపురం విద్యుత్ శాఖ ఈఈ వై. విజయానంద్ తెలిపారు. ఈ మేరకు మండలంలోని చొప్పెల్ల, చెముడులంక, బడుగువానిలంక, గాంధీనగరం, మడికి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.