బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండంలంలోని ముత్యాల చెరువు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన వాడి, నడిమితండా గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఎంపీ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.