తిరుపతి జిల్లా గూడూరు మండలం సనత్ నగర్లో టీడీపీని వదిలి, వైసీపీలో వంద మంది యువకులు ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇప్పించి వారికి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు.