రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130కి పైగా స్థానాలు సాధించి అధికారం చేపట్టనుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సైదాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా మోహన్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్దించారు.