వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 కు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.