నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండలం, కొప్పోలు గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న అని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.