సేవ్ ఆర్టీసీ నినాదంతో కార్మికులు శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు,ఎస్ డబ్ల్యూఎఫ్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వాలు పరిరక్షించకపోతే తమ మనుగడకే ముప్పువాటిలోతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి మాత్రమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.